Tuesday, October 15, 2013

బొబ్బట్లు



కావలిసినవి

శనగ పప్పు -1 గ్లాస్
బెల్లం-1 1/4  గ్లాస్
మైదా -1 గ్లాస్ 
నెయ్యి –కొద్దిగా
యాలకులు – కొద్దిగా
నూనె  – కొద్దిగా
ఉప్పు – కొద్దిగా


చేసేవిదానం

 మైదాపిండిలో ఉప్పు వేసి కలిపి,నెయ్యి వేసి కలిపి ,నీళ్ళు  కూడ వేసి చపాతి పిండి లాగా కలిపి,నెయ్యి వేసి 1/2 గంట నాన పెట్టాలి.
శనగ పప్పు ని ఉడికించు కోవాలి...
ఉడికించు కున్న పప్పు లో నీరు లేకుండా చేసి,తరుగుకున్న బెల్లం వేసి బాగ కలిపి ,వుండలు చేసుకొవాలి...

శనగ పప్పు లొ బెల్లం కలిపితే ముద్దగా వుంటే సరే లేకపొతే శనగ పప్పు,బెల్లం మిశ్రమాన్ని బాండి లో వేసి బాగ వుడకనించి,అంటే వుండ వచ్చే అంత వరకు వుడకనివ్వాలి

మైదా ని పూరి లాగా వత్తు కోని దాని లొ శనగ పప్పు బెల్లం కలిపిన వుండను పెట్టి ,

పూరి తో చుట్టి,ప్లాస్టిక్ కవర్ మీద నూనే రాసి ఈ వుండ ని పెట్టి చేతి వేళ్ళ కి కూడా నూనే రాసి వత్తి ,

పెనం మీద కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి. అంతే బొబట్లు సిద్దం ...

No comments :

Post a Comment