Thursday, March 30, 2017

బీర+సొర+వంకాయ+దోస కాయ + ఉల్లిపాయ+టొమోటొ పప్పు

కావలిసినవి

కంది పప్పు-1/2 కప్పు
బీర కాయ ...చిన్న ముక్క
సొర కాయ ...చిన్న ముక్క 
వంకాయ ... 1
దోస కాయ ... చిన్న ముక్క
ఉల్లి పాయ ... 1
టొమోటొ... 1
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపకాయముక్కలు-2
పచ్చి మిరపాకాయలు-2
చింత పండు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం -కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా



చేసే విదానం


దోస,బీర,సొర,కాయ కి, తొక్కు తీసి, చిన్న చిన్న ముక్కలు గా తరుగు కోవాలి.
వంకాయ ను చిన్న చిన్న ముక్కలు గా నీళ్ళలో తరుగు కోవాలి.
ఉల్లి పాయ,టొమోటొ ల ను చిన్న చిన్న ముక్కలు గా తరుగు కోవాలి.
కుక్కర్ లొ తరుగు కున్న(ఉల్లి పాయ తప్ప) అన్నిముక్కలు , కంది పప్పు విడి విడి గా ఉడక పెట్టుకొవలి.
చింత పండు ను నాన పెట్టుకొవాలి
తరువాత పాన్ లో నూనె వేసి అది కాగగానే ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయముక్కలు, ఇంగువ , కరివేపాకు కొద్దిగ వేసి, పచ్చి మిరపాకాయలు కూడ వేసి ,ఉల్లి పాయ ముక్కలు వేసి, ఉడకపెట్టిన కాయ ముక్కల  ను కూడ వేసి ,నాన పెట్టుకున్న చింత పండు నీళ్ళను కూడ వేసి బాగ కలిపి ఉడకనించి,ఉడకపేట్టిన కంది పప్పు ను కూడ వేసి,బాగ కలిపి తగినంత ఉప్పు,కారం వేసి బాగ ఉడికించవనలను.
అంతే  పప్పు తయారు..:)

No comments :

Post a Comment